మరో వివాదంలో ఆప్ ఎంపీ

3 Sep, 2016 13:52 IST|Sakshi
మరో వివాదంలో ఆప్ ఎంపీ
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, పంజాబ్లోని సింగ్రూర్ ఎంపీ భగవత్ మన్ సింగ్ ఏరికోరి మరీ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఓ సారి మద్యం సేవించి పార్లమెంట్కు రావడం... మరోసారి పార్లమెంట్ భద్రతను పణంగా పెట్టి వీడియో తీయడం.. తాజాగా జర్నలిస్టులను కించపరచడం. ఈ వివాదాలతో భగవత్ మన్ సింగ్కు ఎక్కడి లేని చిక్కులు వచ్చిపడుతున్నాయి. తాజాగా జర్నలిస్టులను కించపరిచినందుకు ఎంపీకు వ్యతిరేకంగా పంజాబ్ బాసనీ పథానా పోలీసుల స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది.  హిందీ న్యూస్పేపర్లో పనిచేసే ఓ వర్కింగ్ జర్నలిస్టుపై దురుసుగా వ్యవహరించినందుకు ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైంది. ఆ హిందీ జర్నలిస్టు భగవత్ మన్పై ఎఫ్ఐఆర్ను నమోదుచేశారు.
 
బాసీ పథానాలోని ఫతేగఢ్ సాహిబ్లో నిర్వహించిన ర్యాలీ వెన్యూకు ఆయన ఆలస్యంగా రావడంపై జర్నలిస్టు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు కోపోద్రుహులైన భగవత్ మన్, జర్నలిస్టుపై మీడియా ముందే దురుసుగా ప్రవర్తించారు. మీడియాను కించపరిచినట్టు మాట్లాడిన ఆప్ ఎంపీ, మీడియాను వెంటనే ర్యాలీ నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించారు.  ప్రతి జర్నలిస్టుకు ఓ రేటు ఉంటుందని, మీడియా కవరేజ్ అవసరం లేని పార్టీ ఆప్నేనని కితాబు ఇచ్చుకున్నారు. వార్తలు రాయడానికి ప్రతి జర్నలిస్టు డబ్బులు తీసుకుంటారని ఆరోపించారు. 
>
మరిన్ని వార్తలు