ఓ హోటల్ యజమానిపై కొంతమంది దుండగులు దాడి చేసి, తుపాకితో బెదిరించి రూ. 4 లక్షల విలువైన నగలు, నగదు దోచుకెళ్లారు. మహారాష్ట్రలోని థానె జిల్లా కశ్మీరియా ప్రాంతంలో ఉండే సనమ్ హోటల్ యజమాని సతీష్ హస్బే (36)ను బుధవారం అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు బయటకు పిలిచారు. అతడు బయటకు రాగానే వారిలో ఒకరైన వివేక్ హెగ్డే అనే వ్యక్తి రివాల్వర్ బయటకు తీసి హస్బేకు గురిపెట్టి అతడిని బెదిరించినట్లు ఏసీపీ సహాజీ పవార్ తెలిపారు.
హస్బే తప్పించుకోడానికి ప్రయత్నం చేయగా, వారిలో ఒకడు సిమెంటు దిమ్మతో బలంగా కొట్టడంతో అతడికి తీవ్రగాయమైంది. వెంటనే వాళ్లు నలుగురూ అతడి వద్ద ఉన్న రూ. 1.5 లక్షల నగదు, బంగారు గొలుసు, హస్బే వేసుకున్న ఇతర ఆభరణాలు (వాటి విలువ రూ. 2.5 లక్షలు) తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత హస్బేను ఆస్పత్రిలో చేర్చారు.