ఫూంచ్ సెక్టార్లో మరోసారి కాల్పుల ఉల్లంఘన

10 Aug, 2013 08:45 IST|Sakshi

శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. జమ్మూ కాశ్మీర్లో శనివారం పాకిస్తాన్ సైన్యం భారత్ జవాన్లపై కాల్పులకు తెగబడింది.  నిబంధనలు ఉల్లంఘిస్తూ భారత్- పాకిస్తాన్ సరిహద్దులోని పూంచ్ సెక్టార్లోని  పాక్ సైన్యాలు కాల్పులకు మళ్లీ తెగబడ్డాయి. అయితే భారత్ బలగాలు ధీటుగా సమాధానం ఇచ్చారు. పాక్ సైనికుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు.

ఇరు దేశాల మధ్య ఉన్న ఒప్పందాలను పాకిస్థాన్ పలుమార్లు ఉల్లంఘిస్తూ వస్తోంది. పూంచ్ జిల్లాలో వాస్తవాధీన రేఖ వెంబడి భారత ఔట్ పోస్టులపై పాక్ కాల్పులకు తెగబడటం పరిపాటిగా మారిపోయింది. గత మంగళవారం పాకిస్తాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో అయిదుగురు భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలి

మరిన్ని వార్తలు