పెట్రోల్పై రూ.1.42 డీజిల్పై రూ.2.01
న్యూఢిల్లీ: పెట్రో ధరలు తగ్గాయి. పెట్రోల్పై లీటర్కు రూ. 1.42, డీజిల్పై రూ.2.01 మేర దిగివచ్చాయి. నెలరోజుల్లో ఇది మూడో తగ్గింపు. తాజా ధరలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. తగ్గింపుతో ఢిల్లీలో పెట్రోల్ రూ. 62.51 నుంచి రూ. 61.09కి, డీజిల్ రూ. 54.28 నుంచి రూ. 52.27కి తగ్గాయి. అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి ధరలు తగ్గడం, రూపాయి-డాలర్ మారకం విలువ మెరుగుపడటం వల్ల రేట్లు తగ్గాయని, దీన్ని వినియోగదారులకు బదలాయింపు చేస్తున్నామని దేశంలో అతిపెద్ద ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆదివారం వెల్లడించింది.