పేటీఎం వాటాను విక్రయించిన రిలయన్స్‌

7 Mar, 2017 13:57 IST|Sakshi

న్యూఢిల్లీ:  రిలయన్స్‌  కాపిటల్‌ , పాపులర్‌ డిజిటల్‌ పేమెంట్‌  సంస్థ  పేటీఎం  ద్వారా భారీ లాభాలను మూటగట్టుకుంది. అనిల్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ  పేటీఎంలోని  తన (దాదాపు 1 శాతం) వాటాను విక్రయించింది.  చైనా కంపెనీ ఆలీబాబా గ్రూప్ కు రూ. 275 కోట్లకు  పేటీఎం వాటాను అమ్మేసింది. ఈ విక్రయంతో  భారీ లాభాలను రిలయన్స్‌ గ్రూప్‌  దక్కించుకుంది.

ప్రపంచంలోని టాప్ ఈ-కామర్స్ సైట్లలో  ఒకటైన పేటిఎంలో రిలయన్స్‌ గ్రూపునకు చెందిన ఫైనాన్షియల్‌ సంస్థ గతంలో రూ.10కోట్ల మేర పెట్టుబడులు పెట్టింది.    తాజాగా  ఈ వాటాను రూ.275కోట్లకు విక్రయించడం విశేషం. దీంతో ఇప్పటికే  ఆలీబాబా ఒక వ్యూహాత్మక పెట్టుబడిదారుగా గాన్న  పేటీఎం కంపెనీ విలువ 4 బిలియన్  డాలర్లకు చేరింది.

అయితే తన నాన్‌ కోర్ అసెట్స్ ను క్రమబద్ధీకరించే  ప్రణాళికల్లో  భాగంగా దాని యాజమాన్య పెట్టుబడులను తగ్గించుకోనున్నట్టు అంతకుముందు రిలయన్స్ కాపిటల్  తెలిపింది. గత ఏడాది డిసెంబర్ లో  పేటీఎం  స్థాపకుడు , సీఈవో విజయ్ శేఖర్ శర్మ మాతృ సంస్థ,  వన్‌ 97 కమ్యూనికేషన్స్ లో 1 శాతం( రూ.325 కోట్ల) వాటాను విక్రయిచారు.  కాగా ఈ పరిణామాలపై స్పందించడానికి రిలయన్స్‌, పేటిఎం ప్రతినిధులు నిరాకరించారు.
 

మరిన్ని వార్తలు