'విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదు'

5 Sep, 2015 16:32 IST|Sakshi
'విచారణకు ఇంద్రాణి సహకరించడం లేదు'

ముంబై: షీనా బోరా హత్య కేసులో నిందితులకు ఈ నెల 7 వరకు పోలీస్ కస్టడీ పొడగించారు. ఈ కేసులో షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఇంద్రాణి మాజీ భర్త సంజీవ్ ఖన్నా, కారు డ్రైవర్ శ్యామ్వర్ రాయ్ నిందితులుగా ఉన్నారు.

శనివారం వీరిని కోర్టులో ప్రవేశపెట్టారు.  షీనా హత్య కేసులో ఇంద్రాణి సహకరించడంలేదని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కేసు విచారణ కోసం నిందితులకు రిమాండ్ పొడగించాలని పోలీసులు కోర్టును కోరారు. కోర్టు నిందితులకు కస్టడీ పొడగించడంతో పోలీసులు వారిని ఖర్ పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసులో ఇంద్రాణి తన మాజీ భర్త సంజీవ్ ఖన్నాతో కలసి డ్రైవర్ సాయంతో కన్న కూతురు షీనాను హత్య చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు