గుంటూరులో వీసీ నుంచి అవార్డు అందుకుంటున్న రైతు రఘు
బుచ్చెయ్యపేట : మండలంలోని బంగారుమెట్టకు చెందిన రైతు సాయం రఘు రాష్ట్ర ఉత్తమ రైతుగా ఉగాది పురస్కారం దక్కించుకున్నారు. బుధవారం ఉగాది పర్వదినాన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం గుంటూరులో జరిగిన వేడుకల్లో వైస్ చాన్సలర్ విష్ణువర్థన్రెడ్డి చేతుల మీదుగా రఘు ఈ అవార్డును అందుకున్నారు. వ్యవసాయంలో ఆధునిక మెలకువలు పాటించి, సమగ్ర సస్య రక్షణ చేస్తూ, శాసీ్త్రయ పద్ధతుల్లో అధిక పంట దిగుబడులు సాధించడంతో రఘును రాష్ట్ర ఉత్తమ రైతుగా ఎంపిక చేశారు. అవార్డు అందుకున్న రఘును మండల నాయకులు, వ్యవసాయశాఖ అధికారులు అభినందించారు.