ముగిసిన సువార్త సభలు

10 Nov, 2023 05:32 IST|Sakshi

ఉట్టి పడిన భక్తిభావం

పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు

అనంతపురం కల్చరల్‌: క్రీస్తు మహిమలను ఘనంగా చాటుతూ మూడు రోజులుగా సాగిన సువార్త సభలు గురువారం రాత్రి ఘనంగా ముగిశాయి. అనంతపురంలోని న్యూటౌన్‌ జూనియర్‌ కళాశాల మైదానం చివరి రోజు క్రైస్తవ భక్తులతో కిక్కిరిసింది. కోయర్‌ బృందాల భక్తిగీతాలు, సామూహిక ప్రార్థనలతో భక్తిభావం ఉట్టిపడింది. క్రీస్తు మహిమను ఘనపరుస్తూ అంతర్జాతీయ సువార్తీకులు రెవరెండ్‌ జాన్‌వెస్లీ, సిస్టర్‌ బ్లెస్సీ వెస్లీ బైబిల్‌లోని పలు ఘట్టాలను వివరించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య మాట్లాడుతూ... మనిషిని ప్రశాంతత వైపు నడిపిస్తున్న వెస్లీ దంపతులు అభినందనీయులన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు గంగుల భానుమతి, సువార్త సభల నిర్వాహకులు జోయల్‌ గణేష్‌, కొఠారి విక్టర్‌ డేనియల్‌, పాస్టర్లు రెవరెండ్‌ సంపత్‌కుమార్‌, మోజెస్‌ అనిల్‌కుమార్‌, ఐజయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు