15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి 

9 Dec, 2023 06:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐల­కు పదోన్నతిపై డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలు ఇలా ఉన్నాయి:  ఎస్‌.వహీద్‌ బాషా( సీఐడీ), ఎం.హనుమంతరావు(సీఐడీ), టీవీ రాధా స్వామి (ఎస్‌బీ, గుంటూరు), డి.శ్రీహరిరావు (ఏసీబీ), జి.రాజేంద్ర ప్రసాద్‌ (ఇంటెలిజెన్స్‌), బి.పార్థసారథి ( సీఎస్‌బీ, విజయవాడ), కె.రసూల్‌ సాహెబ్‌ (సీఐడీ), ఎం.కిశోర్‌ బాబు ( విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌), డీఎన్‌వీ ప్రసాద్‌ (ఇంటెలిజెన్స్‌), జి.రత్న రాజు ( పోలవరం), పి.రవిబాబు (ఇంటెలిజెన్స్‌), షేక్‌ అబ్దుల్‌ కరీమ్‌ (పీసీఎస్‌ అండ్‌ ఎస్‌), ఎస్‌. తాతారావు (విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌), కోంపల్లి వెంకటేశ్వరరావు(విజిలెన్స్‌–ఎన్‌ఫోర్స్‌మెంట్‌), సీహెచ్‌.ఎస్‌.ఆర్‌.కోటేశ్వరరావు(ఏసీబీ).

>
మరిన్ని వార్తలు