AP: కొత్తగా రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు.. త్వరలోనే పనులు ప్రారంభం

8 Sep, 2022 09:27 IST|Sakshi

పామర్రు–గుడివాడ, రాయచోటి బైపాస్‌ నిర్మాణానికి ఆమోదం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రెండు చోట్ల నాలుగు లేన్ల రహదారులు అందుబాటులోకి రానున్నాయి. కృష్ణా జిల్లాలోని పామర్రు–గుడివాడ, అన్నమయ్య జిల్లాలోని రాయచోటి బైపాస్‌ రహదారులను నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయనున్నారు.

గతంలో రెండు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ఈ రహదారుల్లో ట్రాఫిక్‌రద్దీ పెరిగిన దృష్ట్యా నాలుగు లేన్లుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదించింది. అందుకోసం త్వరలోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లో మార్పులు చేసి పనులు ప్రారంభించనుంది.   

చదవండి: (విషాదం: ఒక్క క్షణం ఆలోచించి ఉంటే.. నేడు నవ్వుతూ ఇంట్లో ఉండేది)

మరిన్ని వార్తలు