సాక్షి, అమరావతి : మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. చంద్రబాబు గత ఐదేళ్ల పాలన నిర్ణయాలు, పాలసీలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయగా, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుపై హైకోర్టులో టీడీపీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు గత ప్రభుత్వ నిర్ణయాల సమీక్ష చేసేందుకు ఏర్పాటు చేసిన సబ్కమిటీపై స్టే ఇచ్చింది. దీంతో కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. (అమిత్షాను కలిసిన సీఎం జగన్)