Bhuma Akhila Priya: బోయిన్‌పల్లి పోలీసులపై అఖిలప్రియ ఫిర్యాదు 

11 Aug, 2021 08:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బోయిన్‌పల్లి పోలీసులు కిటికీ అద్దాలను పగులగొట్టి  తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, విలువైన  ఆస్తి పత్రాలను తీసుకెళ్లారని మంగళవారం ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల మొదటివారంలో బోయిన్‌పల్లి పోలీసులు తన ఇంట్లోకి ప్రవేశించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్న ఆమె.. దాదాపు నెల రోజుల తర్వాత కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

మరిన్ని వార్తలు