పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు, ప్రత్యేక రైళ్ల పొడిగింపు

2 Dec, 2023 04:53 IST|Sakshi

రైల్వేస్టేషన్‌(విజయవాడ పశ్చిమ):  విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న ట్రాక్‌ నిర్వహణ పనుల కారణంగా డివిజన్‌ మీదుగా నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికం గాను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

ఈ నెల 4 నుంచి 17వ తేదీ వరకు కాకినాడ పోర్టు–విశాఖపట్నం (17267/­17268), మచిలీపట్నం–విశాఖపట్నం (17219/17220), ఈ నెల 5 నుంచి 18 వరకు గుంటూరు–రాయగడ (17243/17244), బిట్రగుంట–విజయవాడ (07977/07978), విజయవాడ–­తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/­07575), విజయవాడ–గూడూరు (07500), విజయవాడ–గూడూరు (12744), ఈ నెల 4, 5, 6, 8 తేదీలలో విజయవాడ–విశాఖపట్నం (22702), ఈ నెల 9, 11, 12, 13 తేదీలలో విశా­ఖపట్నం–విజయవాడ (22701), ఈ నెల 4 నుంచి 18వ తేదీ వరకు గుంటూరు–విశాఖపట్నం (17239/17240), ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు విశాఖపట్నం–గుంటూరు (17240), ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు, అదే విధంగా ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/17238), ఈ నెల 5 నుంచి 18వ తేదీ వరకు గూడూరు–విజయవాడ (07458/­12743) రైళ్లు పూర్తిగా రద్దు చేశారు. కాగా, మచిలీపట్నం– విజయవాడ, నర్సాపూర్‌–విజయవాడ, విజయవాడ–భీమవరం మధ్య రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 

ప్రత్యేక రైళ్లు పొడిగింపు: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వేర్వేరు ప్రాంతాల నుంచి నడుపుతున్న పలు రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు పూర్ణా–తిరుపతి (07609), ఈ నెల 5 నుంచి 26వ తేదీ వరకు తిరుపతి–పూర్ణా (07610), ఈ నెల 2 నుంచి 30వ తేదీ వరకు హైదరాబాద్‌–నర్సాపూర్‌ (07631), ఈ నెల 3 నుంచి 31వ తేదీ వరకు నర్సాపూర్‌–హైదరాబాద్‌ (07632), ఈ నెల 3 నుంచి 31వ తేదీ వరకు తిరుపతి–సికింద్రాబాద్‌ (07481), ఈ నెల 4 నుంచి 25వ తేదీ వరకు సికింద్రాబాద్‌–తిరుపతి (07482), ఈ నెల 1 నుంచి 29వ తేదీ వరకు కాకినాడ టౌన్‌–లింగంపల్లి (07445), ఈ నెల 2 నుంచి 30వ తేదీ వరకు లింగంపల్లి–కాకినాడ టౌన్‌ (07446) రైళ్లను పొడిగించారు.

మరిన్ని వార్తలు