ఉపరితల ద్రోణి: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

31 Jul, 2020 16:35 IST|Sakshi

సాక్షి, అమరావతి:  తూర్పు-పశ్చిమ బంగాళఖాతం షేర్‌ జోన్ 13 °N అక్షాంశం వెంబడి ఉపరితల ద్రోణి 3.1 కిమీ నుంచి 5.8 కిమీ ఎత్తు మధ్య కొనసాగుతోందని ఏపీ వాతావరణ కేంద్ర వెల్లడించింది. ఇది ఎత్తుకు వెళ్ళేకొద్దీ దక్షిణ దిశ వైపుకు వంపు తిరిగి ఉన్నట్లు ప్రేర్కొంది. దీనివల్ల దక్షిణ కోస్తా ఆంధ్ర, దాని పక్కనే ఉన్న ఉత్తర తమిళనాడు ప్రాంతాలలో 3.1కిమీ నుంచి 5.8కిమీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఎత్తుకు వెళ్లే కొలది ఇది నైరుతి దిశ వైపుకు వంపు తిరిగి, కోత జోన్‌తో  కలసినట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది. దీంతో మరట్వాడ నుంచి ఉత్తర తమిళనాడు వరకు ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 1.5 కిమీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.

మూడు రోజుల వరకు వాతావరణ సూచన: 
ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్ర, యానాం,రాయలసీమ ప్రాంతాల్లో ఈరోజు(శుక్రవారం) ఉరుములు, మెరుపులుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అదే విధంగా రేపు ఈ ప్రాంతాల్లో  ఉరుములు, మెరుపులుతో పాటు ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల  కురిసే అవకాశం ఉంది.  ఇక ఆదివారం కూడా ఈ మూడు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల  కురిసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు