Anakapalle: అనకాపల్లి స్వాతి కేసులో కొత్త ట్విస్ట్‌

26 Apr, 2022 18:04 IST|Sakshi

సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా మాడుగులలో యువతిపై బ్లేడుతో దాడి చేసిన కేసులో కొత్త ట్విస్ట్‌ బయటపడింది. తనపై బ్లేడ్‌తో దాడి చేసింది నగేష్‌ అని బాధిత యువతి చేసిన ఆరోపణల్లో నిజం లేదని తేల్చారు. యువతిపై దాడి జరిగిన సమయంలో నగేష్‌ మాడుగుల జంక్షన్‌లో వ్యాపారం చేసుకుంటున్నట్లు అనకాపల్లి డీఎస్పీ  సునీల్‌ కుమార్‌ తెలిపారు.

సీసీ కెమెరాలు, కాల్‌ డేటా సేకరించిన తర్వాత ఈ కేసులో నగేష్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఈ కేసును మరింత లోతుగా విచారణ చేస్తున్నామని.. మెడికల్‌ రిపోర్ట్‌ల తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ సునీల్‌కుమార్‌ అన్నారు. 

చదవండి: (దారుణం.. మేనకోడలిని ఖతం చేసేందుకు రూ. లక్ష సుపారీ)

మరిన్ని వార్తలు