విశాఖపట్నం: నీతి అయోగ్ గ్రోత్ హబ్ సిటీ, రాజధాని వసతులు, సౌకర్యాల పరిశీలనకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ బృందం సోమవారం నుంచి విశాఖలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. విశాఖలో సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో రుషికొండలోని ఐటీ హిల్స్లో ఏర్పాట్లను ఆయన ఆదివారం తనిఖీ చేశారు.
మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం ముగ్గురు ఐఏఎస్లతో ఓ బృందాన్ని నియమించిందని ఈ కమిటీ ఇప్పటికే పని ప్రారంభించిందనీ.. క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించనుందని తెలిపారు.