పని వారి కోసం ‘సిప్‌’

28 Nov, 2022 14:30 IST|Sakshi

ముంబై: ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ వినూత్నంగా ‘సహ్‌యోగ్‌’ అనే ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమకు సాయపడే సిబ్బంది పేరిట సిప్‌ ప్రారంభించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.

రోజువారీ మన జీవితాలను సౌకర్యవంతం చేయడం కోసం డ్రైవర్లు, వంట మనుషులు, గార్డెనర్లు, ఇంట్లో పనులు చేసే వారు ఎంతో సాయపడుతుంటారని.. వారికి సైతం జీవితంలో ఎదగాలనే కోరిక ఉంటుందని ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ పేర్కొంది. ఇతరుల మాదిరే వారికి సైతం రిటైర్మెంట్, పిల్లల విద్య తదితర లక్ష్యాలుంటాయనే విషయాన్ని గుర్తు చేసింది. 

చదవండి: రోడ్లపై ఆ వాహనాలకు నో ఎంట్రీ..కేంద్రం మరో కీలక నిర్ణయం!

>
మరిన్ని వార్తలు