మరికొద్ది సేపట్లో జరగనున్న భారత్-ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్పై ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ హర్ష్ గోయెంక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ పోస్ట్పై ఓ వర్గానికి చెందిన క్రికెట్ అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంతకి ఆ పోస్ట్లో ఏముందంటే?
వరల్డ్ కప్ మ్యాచ్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు లక్షల ఖర్చు చేసి మరీ మ్యాచ్ టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ మ్యాచ్ను వీక్షించేందుకు నిర్వాహకులు ప్రముఖుల్ని ఆహ్వానిస్తుంటారు. వారికి ఉచితంగా పాస్లు అందజేస్తుంటారు. దీనిపై ఆర్పీజీ ఛైర్మన్ హర్ష్ గోయెంక్ తనదైన స్టైల్లో స్పందించారు.
How about you, Sir? Ticket or Pass.
— Anand Singh (@Anands_page) November 18, 2023
వ్యాపార వేత్తలైనా తన స్నేహితులెవరూ మ్యాచ్ టికెట్లు కొనలేదని ఎక్స్లో పేర్కొన్నారు. ఉచిత పాస్లు పొందారని తెలిపారు. పైగా ధనవంతులే డబ్బులు చెల్లించడానికి ఇష్టపడరని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేయడం వివాదానికి దారి తీసింది.
దీనిపై ఓ వర్గం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు నెటిజన్లు నేరుగా ఇంతకీ మీరు టికెట్లను కొనుగులో చేశారా? లేదంటా పాస్ తీసుకున్నారా? అని ప్రశ్నిస్తుండగా.. అందుకు తాను రెండూ తీసుకోలేదని చెప్పడం గమనార్హం. ఈ పోస్ట్పై కామెంట్లు వైరల్గా మారాయి.
None of my businessmen friends have paid to get tickets for the #WorldcupFinal, they have all managed to get a ‘pass’. And that’s where the irony lies- it’s the rich who don’t want to pay!
— Harsh Goenka (@hvgoenka) November 18, 2023
మ్యాచ్ టికెట్ల ధరలు ఎలా ఉన్నాయంటే?
ఫైనల్ మ్యాచ్ టిక్కెట్ల ధరలు ఒక్కటి రూ. 1.87 లక్షల వరకు పెరిగాయి . క్రికెట్ వరల్డ్ కప్ టిక్కెట్ రీ-సెల్లింగ్ సైట్లోని వయాగోగో (viagogo.com) ధరల ప్రకారం, టైర్ 4లో టిక్కెట్ ధర రూ. 1,87,407 కాగా పక్కనే ఉన్న టైర్ టిక్కెట్ ధర రూ.1,57,421. సైట్లో అతి తక్కువ ధర టిక్కెట్ ధర రూ. 32,000 కంటే ఎక్కువగా ఉన్నాయి.