హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటో కార్ప్ విదా వీ1 ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలను ప్రారంభించింది. బెంగళూరుతో మొదలుకుని దశలవారీగా ఇతర నగరాల్లో డెలివరీలు చేపడతారు.
2022 అక్టోబరులో విదా వీ1 వాహనాన్ని కంపెనీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఒకసారి చార్జింగ్ చేస్తే 163 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. వేరు చేయగలిగే బ్యాటరీ, మూడు రకాల చార్జింగ్ ఆప్షన్స్తో లభిస్తుంది. ఢిల్లీలో ఆన్రోడ్ ధర విదా వీ1 ప్లస్ రూ.1.35 లక్షలు, విదా వీ1 ప్రో రూ.1.46 లక్షలు ఉంది.