Stock Market Updates: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ఫ నష్టాల్లో..

12 Oct, 2021 09:54 IST|Sakshi

Stock Market Updates: స్వల్ప నష్టాల్లో మంగళవారం ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు కొనసాగుతున్నాయి. ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపు లాభాల్లో పయనించినప్పటికీ.. తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 62 పాయింట్లు నష్టపోయి 60,073.48 వద్ద.. నిఫ్టీ 14.05 పాయింట్ల నష్టంతో 17,931 వద్ద కొనసాగుతున్నాయి. 


సెన్సెక్స్‌ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఆటో, ఐటీసీ, భారతీఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టైటన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, టాటా స్టీల్‌, మారుతీ షేర్లు రాణిస్తున్న వాటిలో ఉన్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఎంఅండ్‌ఎం, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫినాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.43 వద్ద ట్రేడవుతోంది.

చదవండి: స్టాక్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్న ఐఆర్‌సీటీసీ

మరిన్ని వార్తలు