సాక్షి, హైదరాబాద్: సిద్ధిపేట జిల్లాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. అర్బన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద సోమవారం కాల్పుల ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపి సుమారు 42.50 లక్షలు దుండగులు ఎత్తికెళ్లినట్లు సమాచారం. కాల్పుల్లో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.