రెండో పెళ్లి.. పట్టుచీరలు, నగలు కొనివ్వాలని పదే పదే కోరడంతో..

26 Jan, 2022 11:14 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

యశవంతపుర (కర్ణాటక): భార్య విలాసాలు తీర్చలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు బసవేశ్వర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  నివాసం ఉంటున్న బాషా(31) ఉస్నా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భిణి. పట్టుచీరెలు, నగలు కొనివ్వాలని పదే పదే కోరేది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగేది. మానసిక ఒత్తిడితో బాషా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: (బుద్ది తెలుసుకొని ఉన్న ఉద్యోగం పీకేశారు.. మళ్లీ నగ్నఫొటోలు, వీడియోలు..)

మరిన్ని వార్తలు