మసాజ్‌సెంటర్‌ ముసుగులో వ్యభిచారం..

9 Jan, 2021 16:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఫిజియో థెరపీ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను సైఫాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకెళ్తే.. ఖైరతాబాద్‌లోని ఓ ఫిజియోథెరపీ క్లినిక్‌ పేరుతో మసాజ్‌ సెంటర్‌ సాగిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పక్కా ప్లాన్‌ ప్రకారం ఓ కానిస్టేబుల్‌ను మఫ్టీలో క్లినిక్‌కు పంపారు. అనంతరం కానిస్టేబుల్‌ వారికి డబ్బులిస్తుండగా పోలీసులు రైడ్‌ చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఫిజియోథెరపీ సెంటర్‌ నిర్వాహకురాలితోపాటు, ఇద్దరు యువతులు, మరో నలుగురు విటులను అరెస్ట్‌ చేశారు. చదవండి: (విషాదం: గుండెపోటుతో జగదీష్‌.. మనోవేదనతో శిరీష..)

మరిన్ని వార్తలు