2,520 కిలోల గంజాయితో వ్యాన్‌ సీజ్‌ 

2 Sep, 2021 03:49 IST|Sakshi
పట్టుబడిన 2,520 కిలోల గంజాయి

సరకు విలువ రూ.75 లక్షలు 

పాడేరు: ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పెద్ద మొత్తంలో పోలీసు శాఖ పట్టుకుంది. మంగళవారం సాయంత్రం విశాఖ జిల్లా పాడేరు మండలం చింతలవీధి జంక్షన్‌ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ30యూ3517 నంబర్‌ గల ఐచర్‌ వ్యాన్‌ తనిఖీ చేయగా ఈ గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసిందని ఎస్‌ఐ లక్ష్మణ్‌ బుధవారం తెలిపారు.

వ్యాన్‌ వెనుక భాగంలో తనిఖీ చేస్తున్న సమయంలో వాహనంలో ఉన్న డ్రైవర్, ఇతర సిబ్బంది తప్పించుకుని పరారయ్యారని ఎస్‌ఐ తెలిపారు. ఈ ఐచర్‌ వ్యాన్‌ను సీజ్‌ చేశామని, 2,520 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.75 లక్షలు ఉంటుందన్నారు. పరారైన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు.  

మరిన్ని వార్తలు