విషాదం: ఇద్దరు పిల్లలకు ఉరేసి తాను ఉరేసుకున్న తల్లి

27 Jun, 2021 22:24 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట జిల్లా: నడిగూడెం మండలం రామాపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను ఉరేసి, అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెప్తున్నారు. ఆమె భర్త శ్రీనాధ్ ఆర్‌ఎంపీ కావడంతో పేషేంట్ తీసుకొని ఖమ్మం వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే లోపు ఈ దారుణం జరిగింది. ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చదవండి: ‘అమ్మను చిత్రహింసలు పెట్టారు.. ఒళ్లంతా వాచిపోయింది’

మరిన్ని వార్తలు