‘చిల్డ్రన్స్‌ ఆఫ్‌ హెవెన్‌’ ఇరానీ చిత్రం ప్రదర్శన

15 Nov, 2023 00:54 IST|Sakshi
‘చిల్డ్రన్స్‌ ఆఫ్‌ హెవెన్‌’లో సన్నివేశం

తెనాలి: బాలల దినోత్సవం సందర్భంగా చిల్డ్రన్స్‌ ఫిలిం సొసైటీ, తెనాలి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల ప్రదర్శనను మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని వివేకానంద సెంట్రల్‌ స్కూల్‌ ఆవరణలోని ఏవీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ధియేటరులో చిత్రోత్సవాన్ని ప్రారంభించారు. తొలిగా ఇరానీ బాలల చిత్రం ‘చిల్డ్రన్స్‌ ఆఫ్‌ హెవెన్‌’ ప్రదర్శించారు. సొసైటీ అధ్యక్షుడు డాక్టర్‌ రావిపాటి వీరనారాయణ, విశ్రాంత ప్రిన్సిపల్‌ కె.రామరాజు, సంస్థ ఉపాధ్యక్షుడు బి.లలితానంద ప్రసాద్‌, మునిపల్లి శ్రీకాంత్‌, మురళి పాల్గొన్నారు. ఈనెల 30వ తేదీ వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో, చిల్డ్రన్‌ ఫిలిం సొసైటీలచే చిత్రాలను ప్రదర్శిస్తామని ప్రధాన కార్యదర్శి బొల్లిముంత కృష్ణ వెల్లడించారు.

మరిన్ని వార్తలు