మద్యం అమ్మకాలు బంద్‌

21 Sep, 2023 15:11 IST|Sakshi

కర్నూలు : గణేష్‌ నిమజ్జన వేడుకలు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, బార్లు, కల్లు దుకాణాలు బంద్‌ చేయించాలన్న కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎకై ్సజ్‌ అధికారులు చర్యలు చేపట్టారు. వెల్దుర్తి, ఎమ్మిగనూరులో ఈనెల 20వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 22 తేది ఉదయం 10 గంటల వరకు, ఆదోని, గూడూరులో 21వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 10 గంటల వరకు, కర్నూలులో 25వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 10 గంటల వరకు బార్లు, మద్యం దుకాణాల్లో విక్రయాలు జరగకుండా సీజ్‌ చేయనున్నట్లు ఎకై ్సజ్‌ అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు