Rajnath Singh: రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు కరోనా..

10 Jan, 2022 16:25 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ దాడి మళ్లీ మొదలైంది. రోజువారీ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, ప్రజా ప్రతినిధుల వరకు అందరూ మహమ్మారి వలలో చిక్కుకుంటున్నారు. తాజాగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. తనకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, స్వల్వ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల తనను కలిసిన  వారందరూ కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు