బంగ్లాదేశ్‌ సమాచార ప్రసార శాఖ మంత్రితో జైశంకర్‌ భేటీ

7 Sep, 2021 17:09 IST|Sakshi
బంగ్లాదేశ్‌ సమాచార ప్రసార శాఖా మంత్రి హసన్‌ మహమూద్‌తో భేటీ అయిన ఎస్‌ జైశంకర్‌ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

న్యూఢిల్లీ: భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ భారత్‌ అధికారిక  పర్యటనలో ఉన్న బంగ్లాదేశ్‌ సమాచార ప్రసార శాఖ మంత్రి హసన్‌ మహమూద్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు జైశంకర్‌ తెలిపారు. 'బంగ్లాదేశ్‌ సమాచార ప్రసార శాఖా మంత్రి హసన్‌ మహమూద్‌ని కలిసినందకు చాలా సంతోషంగా ఉంది. ఈ ద్వైపాక్షిక సహకారం ఇరుదేశాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతోంది' అంటూ జైశంకర్‌ ట్వీట్‌ చేశారు. (చదవండి: ‘భారత్‌ సహాయాన్ని ఎప్పటికీ మరిచిపోలేం’)

మరిన్ని వార్తలు