గుజరాత్‌లోని ధోలవిరాకు దక్కిన ప్రపంచ వారసత్వ గుర్తింపు

27 Jul, 2021 16:47 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల తెలంగాణలోని రామప్ప ఆలయం యునెస్కో జాబితాలో చేర్చగా తాజాగా మరో కట్టడం యునెస్కో జాబితాలో చేరింది. గుజరాత్‌లోని ధోలవిరాకు యునెస్కో వారసత్వ గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని యునెస్కో మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ధోలవిరాను ప్రపంచ వారసత్వ జాబితాలో చేరుస్తూ యునెస్కో ట్వీట్‌ చేసింది. హరప్పా నాగరికత నాటి పట్టణంగా ధోలవిరా ప్రసిద్ధి చెందింది. కచ్‌ జిల్లాలో ఉన్న ఈ పట్టణం 4,500 ఏళ్ల చరిత్ర ఉందని ఆధారాలు ఉన్నాయి. భారత్‌ నుంచి యునెస్కో గుర్తింపు పొందిన 40వ వారసత్వ సంపద ధొలవిరా పట్టణం. ఈ విషయాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి ట్విటర్‌లో తెలిపారు.
 

మరిన్ని వార్తలు