పక్షి ఢీకొట్టడంతో విమానానికి పగుళ్లు.. అత్యవసర ల్యాండింగ్‌

5 Aug, 2022 19:29 IST|Sakshi

లక్నో: దేశంలో వివిధ కారణాలతో విమానాలు దారి మళ్లించటం, అత్యవరంగా ల్యాండింగ్‌ చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా వారణాసి నుంచి ముంబయి వెళ్తున్న విస్తారా విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేశారు. గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీకొట్టినట్లు డీజీసీఏ పేర్కొంది. దాంతో విమాన్ని వెనక్కు మళ్లించి ల్యాండింగ్‌ చేసినట్లు తెలిపింది. 

‘విస్తారా ఏ320 ఎయిర్‌క్రాఫ్ట్‌ వీటీ-టీఎన్‌సీ ఆపరేట్‌ చేస్తున్న యూకే622 విమానం సురక్షితంగా వారణాసిలో ల్యాండింగ్‌ అయింది. విమానం దిగినట్లు విమానయాన సంస్థ స్పష్టం చేసింది. పక్షి ఢీకొట్టటంతో ఎయిర్‌క్రాఫ్ట్ ముందుభాగం దెబ్బతిన్నది.’ అని ట్విట్టర్‌లో వెల్లడించింది డీజీసీఏ.

ఇదీ చదవండి: Go First Airlines: పక్షి ఢీ కొట్టడంతో విమానం అత్యవసర ల్యాండింగ్‌!

మరిన్ని వార్తలు