Madhaya pradesh: రైలులో యువతిపై అకృత్యం.. బాత్రూమ్‌లో నిందితుని పట్టివేత!

12 Dec, 2023 11:59 IST|Sakshi

మధ్యప్రదేశ్‌లో కదులుతున్న రైలులో యువతిపై అత్యాచారం జరిగింది. ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న బాలికపై రైలులోని బాత్‌రూమ్‌లో అత్యాచారం జరిగింది. నిందితుడు బాధితురాలిపై దాడికి పాల్పడ్డాడు. బాధిత యువతి యువతి.. కట్నీ నుంచి ఉచెహ్రాకు రైలులో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో ఓ యువకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఘటన అనంతరం నిందితుడు బాత్‌రూమ్‌ లోపల దాక్కుని గొళ్లెం పెట్టుకున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు  బాత్రూం తలుపులు పగులగొట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఒక యువతి కట్నీ నుండి ఉచెహ్రాకు ‘మెము’ రైలులోని ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తోంది. రైలు పకారియా స్టేషన్‌కు చేరుకోగానే  ఆ యువతి బాత్‌రూమ్‌కి వెళ్లింది. ఈ సమయంలో ఓ యువకుడు బాత్రూంలోకి బలవంతంగా ప్రవేశించాడు. బాత్రూమ్ తలుపును లోపలి నుంచి మూసేశాడు. అనంతరం ఆ యువతిపై దాడిచేసి, అత్యాచారం చేశారు. 

రైలు సత్నా స్టేషన్‌కు చేరుకోగానే బాధితురాలు కేకలు వేస్తూ బాత్‌రూమ్‌ డోరు తెరిచింది. అనంతరం జరిగిన ఘటనపై సత్నా స్టేషన్‌లోని జీఆర్పీకి సమాచారం అందించింది. రైలు తదుపరి స్టేషన్ కీమాలో ఆగింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్ బృందాలు కీమా స్టేషన్‌కు చేరుకున్నాయి. వారు రైలులోకి ప్రవేశించగానే, నిందితుడు బాత్‌రూమ్‌లోకి వెళ్లి గొళ్లెం పెట్టుకున్నాడు. దీంతో పోలీసులు తలుపులు పగులగొట్టి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రైలులో చిరు వ్యాపారం చేస్తుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం సత్నా రైల్వే పోలీసులు నిందితుడిని కట్నీ జీఆర్పీ పోలీసులకు అప్పగించారు.
ఇది కూడా చదవండి:  ‘తండ్రిని చూస్తే వణుకు’... ‘ఆత్మకథ’లో శరద్‌ పవార్‌!
మరిన్ని వార్తల కోసం సాక్షి వాట్సాప్‌ ఛానల్‌ వీక్షించండి: 

>
మరిన్ని వార్తలు