మహిళా మిషన్‌ శక్తి బలోపేతానికి కృషి

12 Nov, 2023 00:30 IST|Sakshi
జయపురంలో వీక్షిస్తున్న ప్రజలు

జయపురం: రాష్ట్రంలో మహిళా మిషన్‌ శక్తి, స్వశక్తీకరణ బలోపేతానికి కృషి చేస్తున్నామని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ వెల్లడించారు. నేడు రాష్ట్రంలోని ప్రతీ సమితిలో అమొ ఒడిశా నవీన ఒడిశా కార్యక్రమాన్ని వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొరాపుట్‌ జిల్లాలో 3,087 ప్రాజెక్టులను చేపట్టేందుకు రూ.170 కోట్లతో నిధులు విడుదల చేశామని తెలియజేశారు. జయపురం క్రీడా మైదానంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సస్మిత మెలక, జయపురం సమితి అధ్యక్షురాలు తిలోత్తమ ముదులి, ఉపాధ్యక్షులు గణేష్‌ పాఢీ, జయపురం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌ బి.సునీత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు