బీసీ రథయాత్రను విజయవంతం చేయండి | Sakshi
Sakshi News home page

బీసీ రథయాత్రను విజయవంతం చేయండి

Published Sun, Nov 12 2023 12:30 AM

సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘ నాయకులు  - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): హక్కుల సాధన కోసం డిసెంబర్‌ ఏడో తేదీన నిర్వహించనున్న బీసీల రథయాత్రను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్ట చంద్రపతిరావు కోరారు. శ్రీకాకుళంలోని ఎన్జీవోహోమ్‌లో శనివారం సంఘం కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నాయుకులు మాట్లాడుతూ.. ఈ నెల 15న రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గం సభ్యులతో కలిసి కంపోస్ట్‌ కాలనీలోని యాదవ సామాజిక భవనంలో బీసీ రథయాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరిస్తామన్నారు. శ్రీకాకుళంలో జరగబోయే రథయాత్రకు రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, 139 బీసీ కులాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు బాడాన దేవభూషణరావు, బుడుమూరు రాజేష్‌, కాయితి వెంకటరమణ, పాలిన ప్రసాద్‌, గద్దిబోయిన కృష్ణ, ఇప్పిలి చిన్నారావు, మూల నారాయణ, కర్రి రంగాజీదేవ్‌, కాళ్ల వెంకటరావు, రౌతు శంకరరావు ఉన్నారు.

Advertisement
Advertisement