కుప్పంలో చంద్రబాబు కూలిపోయాడు

29 Aug, 2022 04:09 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి కారుమూరి

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు

ఇరగవరం: కుప్పంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు కూలిపోయాడని, అందుకే బీసీ మహిళా ఎంపీపీపై రాళ్లు వేయించి అరాచకం సృష్టించాడని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విమర్శించారు. ఆయన ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కత్తవపాడులో మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మునిసిపల్‌ చైర్మన్‌ ఇలా మొత్తం అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ విజయం సాధించిందన్నారు. 33 సంవత్సరాల్లో కుప్పానికి ఏమీ చేయకపోవడంతో అక్కడి ప్రజలు చంద్రబాబును పక్కన పెట్టేశారన్నారు.

మూడు సంవత్సరాల్లో వైఎస్‌ జగన్‌ చేసిన అభివృద్ధిని చూసి ఇంత అభివృద్ధి జరుగుతుందా అని అక్కడి ప్రజలు ఆశ్చర్యపోతున్నారన్నారు. అది తట్టుకోలేని చంద్రబాబు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ సీఎం వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీని దూషిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఎన్ని అరాచకాలు చేసినా ప్రశ్నించని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుత సీఎం వైఎస్‌ జగన్‌ ఇన్ని పథకాలు అమలు చేస్తుంటే అరాచకమంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు