న్యూజిలాండ్‌పై పాక్‌ తొలిసారి సిరీస్‌ సొంతం 

6 Dec, 2023 00:56 IST|Sakshi

సమష్టి ప్రదర్శనతో పాకిస్తాన్‌ మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారి న్యూజిలాండ్‌ జట్టుపై టి20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. డ్యూనెడిన్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో పాక్‌ పది పరుగులతో నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో దక్కించుకుంది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అలియా రియాజ్‌ (32 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), మునీబా అలీ  (35; 6 ఫోర్లు) రాణించడంతో... పాక్‌ 6 వికెట్లకు 137 పరుగులు చేసింది.  అనంతరం న్యూజిలాండ్‌ 7 వికెట్లకు 127 పరుగులకే పరిమితమైంది.   

>
మరిన్ని వార్తలు