సనత్‌ జయసూర్యకు కీలక బాధ్యతలు

14 Dec, 2023 19:58 IST|Sakshi

శ్రీలంక క్రికెట్‌ బోర్డు (SLC) ఆ దేశ దిగ్గజ ఆటగాడు సనత్‌ జయసూర్యకు కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ఎస్‌ఎల్‌సీ జయసూర్యను ఓ సంవత్సరం పాటు పూర్తి స్థాయి క్రికెట్ కన్సల్టెంట్‌గా నియమించింది. జయసూర్య ఎంపిక తక్షణమే అమలుల్లోకి వస్తుందని లంక క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. 54 ఏళ్ల జయసూర్య 1991-2011 మధ్యలో లంక క్రికెట్‌ జట్టుకు ఎన్నో అపురూపమైన విజయాలు అందించాడు. 19956 వరల్డ్‌కప్‌ తర్వాత జయసూర్య కెరీర్‌ ఓ రేంజ్‌లో సాగింది. జయసూర్య.. సహచరుడు కలువితరణతో కలిసి ప్రపంచ క్రికెట్‌కు విధ్వంసకర బ్యాటింగ్‌ను పరిచయం చేశాడు. 

కాగా, వన్డే వరల్డ్‌కప్‌ 2023లో పేలవ ప్రదర్శన అనంతరం లంక క్రికెట్‌ వివిధ కారణాల చేత వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఈ జట్టుపై ఐసీసీ తాత్కాలిక నిషేధం కూడా విధించింది. తాజాగా ఆ దేశ క్రీడా వ్యవహారాల మంత్రి హరీన్ ఫెర్నాండో ఐదుగురు సభ్యులతో కూడిన కొత్త సెలక్షన్‌ కమిటీని ​నియమించారు. ఈ కమిటీకి మాజీ కెప్టెన్ ఉపుల్ తరంగ చైర్మెన్‌గా ఎంపిక కాగా.. అజంతా మెండిస్, ఇండికా డి సారమ్, తరంగ పరణవితన, దిల్రువాన్ పెరీరా సభ్యులుగా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు