పుణే: అల్టిమేట్ ఖో–ఖో లీగ్లో తెలుగు యోధాస్ జట్టు క్వాలిఫయర్–2 మ్యాచ్కు అర్హత పొందింది. చెన్నై క్విక్గన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో తెలుగు యోధాస్ 61–43తో గెలిచింది. తెలుగు యోధాస్ కెప్టెన్ ప్రతీక్, ఆదర్శ్ రాణించారు.
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా జగర్నాట్స్, గుజరాత్ జెయింట్స్ క్వాలిఫయర్–1లో తలపడగా ... ఒడిశా జగర్నాట్స్ 57–43తో నెగ్గి ఫైనల్ చేరింది. నేడు జరిగే క్వాలిఫయర్–2లో గుజరాత్తో తెలుగు యోధాస్ తలపడుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఒడిశాతో ఆడుతుంది.