యాదగిరిగుట్టలో విషాదం.. లాడ్జిపై నుంచి దూకి తండ్రీకూతురు ఆత్మహత్య

1 Apr, 2022 10:03 IST|Sakshi

సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్టలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా.. ఓ లాడ్జి పైనుంచి దూకి తండ్రీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్ని హైదరాబాద్‌ లింగంపల్లికి చెందిన చెరకూరి సురేష్‌, శ్రేష్ఠగా పోలీసులు గుర్తించారు.  

మృతదేహాలను భువనగిరి ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. సూసైడ్‌ నోట్‌ ఆధారంగా..  భార్యభర్తల మధ్య గొడవ ఈ అఘాయిత్యానికి కారణమని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు