అసెంబ్లీలో గాంధీ వర్ధంతి

31 Jan, 2022 01:53 IST|Sakshi
అసెంబ్లీ ఆవరణంలో గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తున్న జాఫ్రీ, పోచారం తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ప్రొటెమ్‌ చైర్మన్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు