షాద్నగర్: ప్రతి ఒక్కరూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. బుధవారం మండలంలోని వెంకట్రెడ్డిపల్లి బొడ్రా యి పండుగలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురాతన కాలం నుంచి గ్రామాల్లో బొడ్రాయి పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యా త్మిక చింతన అలవర్చుకోవాలని, తద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రాజావరప్రసాద్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, కాంగ్రెస్ నాయకుడు వీర్లపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.