ఆలయాలు ప్రశాంతతకు నిలయాలు | Sakshi
Sakshi News home page

ఆలయాలు ప్రశాంతతకు నిలయాలు

Published Thu, May 4 2023 4:34 AM

- - Sakshi

ఎమ్మెల్యే ఆనంద్‌

మోమిన్‌పేట: ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని మొరంగపల్లిలో హనుమాన్‌ మందిర ధ్వజస్తంభ స్థాపన, బొడ్రాయి, నవగ్రహ విగ్రహాలు, ఊరడమ్మ, పోచమ్మ, నాదర్‌ లింగమయ్య విగ్రహాల ప్రతిష్ఠాపనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు డీ వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి

తాండూరు టౌన్‌: రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి తాండూరు పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. పట్టణంలోని కోకిల గార్డెన్‌ వద్ద ఉంటున్న మహ్మద్‌ షోయబ్‌(34) మంగళవారం రాత్రి ఇంటి నుంచి స్కూటీపై బయటికి వెళ్లాడు. గంగోత్రి పాఠశాల వద్ద పట్టణంలోకి రావడానికి యూటర్న్‌ తీసుకుంటుండగా సాయిపూర్‌ ప్రాంతానికి చెందిన విద్యార్థి రేహాన్‌ పటేల్‌ బైక్‌పై విలియంమూన్‌ చౌరస్తా నుంచి హైదరాబాద్‌ మార్గం వైపు వెళుతూ షోయబ్‌ స్కూటీని ఢీకొన్నాడు. దీంతో ఇద్దరూ గాయపడ్డారు. షోయబ్‌ తలకు బలమైన గాయం కావడంతో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చెత్తకుప్పలో

శిశు మృతదేహం

మోమిన్‌పేట: మండల కేంద్రమైన మోమిన్‌పేట ఎస్‌టీఓ కార్యాలయ ఆవరణ గోడ పక్కన చెత్త కుప్పలో మగ శిశువు మృతదేహం లభ్యమైంది. బుధవారం ఉదయం అటుగా వెళ్లిన ఓ మహిళ శిశు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమచారం ఇచ్చింది. ఐసీడీఎస్‌ అధికారులకు ఘటనా స్థలానికి చేరుకొని శిశు మృతదేహాన్ని మర్పల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలోనే మహిళ ప్రసవించి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

వైభవంగా బ్రహ్మోత్సవాలు

బొంరాస్‌పేట: గోవింద, విష్ణు సహస్ర నామస్మరణతో శ్రీరాకమకొండ స్వామి దేవస్థానం 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. దుద్యాల మండలం హకీంపేటలో వెలసిన శ్రీరాకమకొండ స్వామి బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా నిర్వహిస్తున్నారు. బుధవారం వేడుకలు వైభవంగా ముగిశాయి. కార్యక్రమాలను తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితులు రామాచారి, ఆలయ వ్యవస్థాపకులు ర్యాకం యాదయ్య, అరుణ, భక్తులు పాల్గొన్నారు.

బొడ్రాయి స్థాపనలో ఎమ్మెల్యే ఆనంద్‌ తదితరులు
1/2

బొడ్రాయి స్థాపనలో ఎమ్మెల్యే ఆనంద్‌ తదితరులు

పూజలందుకున్న స్వామి, అమ్మవార్లు
2/2

పూజలందుకున్న స్వామి, అమ్మవార్లు

Advertisement
Advertisement