మత్స్యకారులకు నైపుణ్య పరీక్షలు

22 Mar, 2023 01:38 IST|Sakshi

ఖిల్లాఘనపురం: మండలంలోని అప్పారెడ్డిపల్లిలో మంగళవారం మత్య్సకారులకు నైపుణ్య పరీక్షలు నిర్వహించారు. అప్పారెడ్డిపల్లి నుండి 73 మంది, పెద్దమందడి మండలం గట్లఖానాపురం నుంచి 25 మంది, కమాలోద్ధీన్‌పూర్‌ నుంచి 17 మంది మొత్తం 115 మంది మత్య్సకారులు పాల్గొన్నారని జిల్లా మత్స్యశాఖ ఫీల్డ్‌మెన్‌ వీరేష్‌ తెలిపారు. వల విసరడం, నీటిలో లాగడం, ఈత కొట్టడం, వల అల్లడం, పుట్టి తోలడం పరీక్షలు నిర్వహించామన్నారు. అర్హులైన మత్స్యకారులకు సభ్యత్వం ఇచ్చేందుకు ప్రభుత్వం నైపుణ్య పరీక్షలు నిర్వహిస్తోందని వివరించారు. కార్యక్రమంలో మత్స్యశాఖ సిబ్బంది మహేష్‌, ఆయా గ్రామాల మత్య్సకారుల సంఘం అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు