ఈ సారి అవకాశం రాక..

12 Nov, 2023 00:50 IST|Sakshi

సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి వైద్య వృత్తి నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ఎంబీబీఎస్‌ చదివిన తర్వాత 1976 నుంచి నాగర్‌కర్నూల్‌లో డాక్టర్‌ సేవలందించిన ఆయన ఎన్‌టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వీ.నారాయణగౌడ్‌ చేతిలో స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1994, 1999, 2004,2009, 2012లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995లో చంద్రబాబు కేబినెట్‌లో తొలిసారిగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మద్యనిషేధం, అటవీ, పంచాయతీరాజ్‌, పౌరసరఫరాలు, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే అలంపూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే వీఎం అబ్రహం డాక్టర్‌గా రాణించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1974లో హైదరాబాద్‌ ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన తర్వాత.. 12 ఏళ్ల పాటు అరబ్‌ దేశాల్లో వైద్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత కర్నూలుకు ఆస్పత్రి ఏర్పాటు చేసి 22 ఏళ్ల పాటు సేవలు అందించారు. తొలిసారిగా 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో టీడీపీ తరుఫున బరిలోకి దిగి ఓడిపోగా.. 2018లో టీఆర్‌ఎస్‌ నుంచి రెండోసారి అసె ంబ్లీలో అడుగుపెట్టారు. మారిన రాజకీయ పరిస్థితులు, యువనాయకత్వం, తదితర కారణాలతో వీరికి ఈసారి పోటీ చేసే అవకాశం దక్కలేదు.

మరిన్ని వార్తలు