నాటుసారా కేంద్రాలపై దాడులు

26 Sep, 2015 11:59 IST|Sakshi

నందిగామ: కృష్ణా జిల్లాలో నాటు సారా తయారీ కేంద్రాలపై శనివారం అబ్కారీ శాఖ దాడులు నిర్వహించింది. జిల్లాలోని నందిగామ, జగ్గయ్య పేట, విసన్నపేట, గన్నవరం ప్రాంతాలలో అధికారులు ఈ దాడులు చేశారు. ఈ దాడుల్లో 23 మంది నాటుసారా విక్రయదారులను అరెస్టు చేశారు. 3 వేల లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. నిందితులపై కేసు నమోదు చేశారు.
 

మరిన్ని వార్తలు