స్వైన్‌ఫ్లూతో హెచ్‌సీయూ విద్యార్థిని మృతి

7 Feb, 2015 01:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ తీవ్రత తగ్గడం లేదు. శుక్రవారం హెచ్‌సీయూకు చెందిన ఓ విద్యార్థిని మృతి చెందింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన సుధానిర్మల(32) వర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో స్కాలర్. తీవ్ర జ్వరం, జలుబు, తలనొప్పితో బాధపడుతూ 4 రోజుల క్రితం శేరిలింగంపల్లిలోని సిటిజన్స్ ఆస్పత్రిలో చేరగా శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందింది. దీంతో జనవరి పదో తేదీ నుంచి ఇప్పటి వరకు స్వైన్‌ఫ్లూతో మృతి చెందిన  వారి సంఖ్య 42కి చేరింది. కాగా మహబూబ్‌నగర్ మండలం ధర్మపూర్ గ్రామానికి చెందిన నిర్మలకు స్వైన్‌ఫ్లూ సోకింది.
 

>
మరిన్ని వార్తలు