గగ్గోలు పెడుతున్న గృహ వినియోగదారులు
మధ్య తరగతి ప్రజలపైనే 80 శాతం భారం పడే ప్రమాదం
ఉద్యమబాటలో విపక్షాలు..
జిల్లా అంతటా వెల్లువెత్తుతున్న నిరసనలు
విజయవాడ : విద్యుత్ చార్జీల పెంపు రూపంలో జిల్లా వాసులకు త్వరలోనే గట్టి షాక్ తగలనుంది. జిల్లాలోని విద్యుత్ వినియోగదారులపై నెలకు రూ.18 కోట్ల మేర భారం పడనుంది. వేసవిలో ఈ మొత్తం రూ.22 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ భారంలో ఎక్కువ శాతం గృహ వినియోగదారులపైనే పడనుంది. నష్టాలను భర్తీ చేసేందుకు విద్యుత్ చార్జీలు పెంచాల్సిందేనని సదరన్ డిస్కం అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఈ నెలాఖరు వరకు వివిధ జిల్లాల్లో విద్యుత్ చార్జీల పెంపుపై బహిరంగ విచారణ పేరుతో ప్రజాభిప్రాయాన్ని సేకరించి వచ్చే నెల నుంచి భారీ వడ్డనకు ప్రభుత్వం రంగం సిద్ధంచేసింది. ఒక వైపు ప్రజలపై భారం పడకుండా చూస్తామంటూనే.. ప్రభుత్వం మరోవైపు ఇందుకు పూర్తి భిన్నంగా విద్యుత్ చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోవడంతో జిల్లా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు అంశం ప్రతిపాదనల దశలోనే ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లాలోని రాజకీయ పార్టీలు ఉద్యమబాట పట్టాయి.
వేసవిలో మరింత పెరిగే అవకాశం..
జిల్లాలో విద్యుత్ శాఖ డివిజన్లు ఏడు ఉన్నాయి. వీటి పరిధిలో 13,67,121 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో కేటగిరీ-1(గృహ వినియోగం)లో సుమారు 13.30 లక్షలు ఉన్నాయి. కేటగిరీ-2 (వాణిజ్య కనెక్షన్లు) 26 వేలు, కేటగిరీ-3(పరిశ్రమలు)లో సుమారు 6వేల కనెక్షన్లు ఉన్నాయి. వీటిని విద్యుత్ శాఖ హైటెన్షన్(హెచ్టీ), లో టెన్షన్ లైన్( ఎల్-సెక్షన్)గా విభజించి నెలవారీగా విద్యుత్ వినియోగాన్ని బట్టి బిల్లులు నిర్ణయిస్తారు. గత నెలలో జిల్లాలో విద్యుత్ బిల్లులు రూ.135.69 కోట్లు వసూలయ్యాయి. ఈ మొత్తంలో ఎల్టీ కేటగిరీ నుంచి రూ.73.36 కోట్లు, హెచ్టీ కేటగిరీ నుంచి రూ.62.33 కోట్లు వచ్చింది. సాధారణంగా వేసవి మూడు నెలలు మినహా మిగిలిన సమయంలో సగటున నెలకు రూ.140 కోట్ల విద్యుత్ బిల్లు డిమాండ్ ఉంటుంది. వేసవిలో అయితే నెలకు రూ.180 కోట్ల నుంచి రూ.190 కోట్ల వరకు వస్తుంది. మార్చి నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో డిస్కంల ప్రతిపాదనలకు అనుగుణంగా శ్లాబ్ల వారీగా చార్జీలు పెంచితే వేసవిలో నెలకు రూ.210 కోట్ల వరకు విద్యుత్ బిల్లులు చేరుతాయని అధికారుల అంచనా వేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలపై అధిక భారం...
ప్రభుత్వ కార్యాలయాలపై కూడా విద్యుత్ చార్జీల భారం పడనుంది. ప్రస్తుతం జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.93 కోట్ల మేర విద్యుత్ బకాయిలు వసూలు కావాల్సి ఉంది. మేజర్ పంచాయతీలు రూ.24.46 కోట్లు, మైనర్ పంచాయతీలు రూ.53.23 కోట్ల బకాయిలు ఉన్నాయి. చార్జీల పెంపు కారణంగా ఈ బకాయిలు రెండు నెలల్లోనే రూ.100 కోట్లకు చేరే అకాశం ఉంది.
నగరంలో 80శాతం భారం ప్రజలపైనే...
ప్రస్తుతం ప్రతిపాదించిన మేరకు విద్యుత్ చార్జీలు పెంచితే నగరంపై నెలకు సగటున రూ.2.45 కోట్ల భారం పడనుంది. వేసవిలో ఈ మొత్తం రూ.4కోట్లకు చేరే అవకాశం ఉంది. ఈ మొత్తంలో 80 శాతం గృహ వినియోగదారులపైనే పడనుంది.
ఇల్లు గుల్లే!
Published Sat, Feb 7 2015 1:04 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement