-

శ్రీశైలం వద్ద ప్రమాదం: వ్యక్తి మృతి

10 Jun, 2015 18:46 IST|Sakshi

ఈగలపెంట (కర్నూలు): శ్రీశైలం ప్రాజెక్టు వజ్రాలమడుగు వద్ద వంతెన నిర్మాణం పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తూ ఒక లారీ డ్రైవర్ చనిపోయాడు. ఈగలపెంట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా సుండిపెంట మండల కేంద్రానికి చెందిన షేక్ మహ్మద్ రఫీ కొంత కాలంగా డ్యాం నిర్మాణ పనుల్లో భాగంగా కంపెనీకి చెందిన టిప్పర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

రోజు మాదిరిగానే కంకర లోడుతో డ్యాం వద్దకు రాగానే  లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి ప్రాజెక్టు దిగువ భాగంలో నిల్వ ఉంచిన నీటిలో పడిపోయింది. ప్రమాదం నుంచి తప్పించుకునే మార్గం లేకపోవడంతో టిప్పర్ డ్రైవర్ లారీతో పాటు నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. రఫీకి తల్లిదండ్రులతో పాటూ ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు ఉన్నారు.

మరిన్ని వార్తలు