విషాదాంతమైన పూజిత అదృశ్యం

19 Feb, 2016 09:19 IST|Sakshi
విషాదాంతమైన పూజిత అదృశ్యం

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం చదలాడలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన పూజిత ఉదంతం విషాదంగా ముగిసింది. ఏలేరు కాలువ వద్ద పూజిత మృతదేహం లభ్యం కావడంతో ఆ కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోయింది. రెండు రోజుల క్రితం మేనమమా వివాహానికి ..పూజిత కుటుంబం చదలాడ వచ్చింది.

బుధవారం ఉదయం చాక్లెట్ కొనుక్కునేందుకు బయటకు వచ్చిన చిన్నారి అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమె కోసం గాలించినా ఫలితం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు పూజితను ఇద్దరు మహిళలు ...ఆటోలో తీసుకు వెళ్లినట్లు సమచారం. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు