స్టీల్ప్లాంట్ నుంచి విషవాయువులు వచ్చే ప్రమాదం!

16 Oct, 2014 10:21 IST|Sakshi
స్టీల్ప్లాంట్ నుంచి విషవాయువులు వచ్చే ప్రమాదం!

హుదూద్ తుఫాను దాటికి విశాఖ స్టీలు ప్లాంటులో నాలుగురోజులగా ఉత్పత్తి నిలిచిపోయింది. ఒక్కసారిగా కరెంటు సరఫరా ఆగిపోవపడంతో పవర్ హౌస్లో ఒక యూనిట్ ట్రిప్పయింది. గురువారం సాయంత్రంలోగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించకపోతే అక్కడి నుంచి విషవాయువులు వెలువడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే, ప్రభుత్వ అధికారుల హెచ్చరికలను స్టీలు ప్లాంటు యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. అక్కడ ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు